ఇప్తార్ విందులో వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకులు మాదగోని జంగయ్య గౌడ్ యండి. రహీం. షరీ

Published: Monday April 18, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 17 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా మంచల్ మండలం. అరుట్ల గ్రామంలో రంజాన్ ఉపవాస మాసం సందర్భంగా. శనివారం రాత్రి ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లిం సోదరులకు వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని. జంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక మజీద్ లో ఇప్తార్ విందు ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమనికి ముఖ్య అధితిగా వైయస్సార్ తెలంగాణ పార్టీ మైనార్టీ రాష్ట్ర నాయకుడు యండి. రహీం షరీఫ్ హాజరు అయ్యి ఈ సందర్భంగా మాట్లాడుతూ కులం మతాలకు అదితంగా ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఏర్పాటు చేయటం చాలా సంతోషకారం అన్నారు ఎల్లప్పుడూ హిందు ముస్లిం బాయి బాయి అంటూ కలిసి మెలసి ఉండాలి అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ మైనార్టీ సోదరుల కోసం స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి మైనార్టీ సోదరుల గుండెలో నిలిచిన మహా నియుడు స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, అని ఈ సందర్భంగా గుర్తు చేసారు ఈ కార్యక్రమంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ ఇబ్రహీంపట్నం మండలం యువజన విభాగం నాయకుడు గోరెంకాల నంద కుమార్ ముదిరాజ్ ముస్లిం సోదరులు యండి. నజీర్ జీలని మియా గలబ్ యూసుఫ్ బాబుజాని ఇర్ఫాన్ సాజిన్ అజిమ్ పాషా ఖాజా పాషా తదితరులు పాల్గొన్నారు