గ్రామాల్లో ప్రజా సమస్యలు పరిష్కరించాలి

Published: Wednesday April 19, 2023

జన్నారం, ఏప్రిల్ 18, ప్రజాపాలన:  ప్రజాసమస్యలు గాలికొదిలేసి గ్రామాల్లో సమస్యలు కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన కేసీఆర్ దోచుకొనేందుకే రాజకీయాలు చేస్తున్నారని, ఆదిలాబాద్ మాజీ ఎంపీ బీజేపీ నేత  రమేష్ రాథోడ్ మండిపడ్డారు. మంగళవారం  మండలంలోని తపాలపూర్ గ్రామంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి కేసీఆర్ అవినీతి పాలనపై ప్రజలను చైతన్య పరిచారు. గ్రామాల్లో సమస్యలు కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన, పట్టించుకోకుండా ప్రజాప్రతినిధులు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజలకు కంటితుడుపు చర్యగానే మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని,డబుల్ ఇంజన్ సర్కారుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కొంతం శంకరయ్య, ఎంపీటీసీలు మధుసూదన్ రావ్, వెంకటస్వామి, ఎస్టీ మోర్ఛా జిల్లా అధ్యక్షులు ఆజ్మీరా బద్రి నాయక్, మహ్మదాబాద్ సర్పంచ్ లక్ష్మణ్, సింగరాయిపెట్ మాజీ సర్పంచ్ దుబ్బా రాజన్న,  శక్తి కేంద్ర ఇంచార్జిలు గుంటుకు కొమురయ్య, యుగేందర్, ఖానాపూర్ అసెంబ్లీ ఐటీ సెల్ కో.కన్వీనర్ బుర్ర గడ్డ జగన్, బూత్ అధ్యక్షులు బండి రాజన్న, నాడెం సతన్న, గోపాల్, బీజేపీ నాయకులు మల్లికార్జున్, చందనగిరి నగేష్, రాజేందర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.