సి సి రోడ్డు ప్రారంభo

Published: Tuesday April 19, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 18 ప్రజాపలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ లో గవర్నమెంట్ హాస్పిటల్ నుండి రాయపోల్ రోడ్డు వరకు సి సి రోడ్డు నిర్మించడానికి మిషన్ భగీరథ వారి  సహకారంతో సి సి రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. కొబ్బరికాయ కొట్టి సి సి రోడ్డు పనులు ప్రారంభించిన మిషన్ భగీరథ ఏఈ, అధికారులు, ఇతరులు  ఇందులో భాగంగానే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 3 వార్డులో ఎస్సీ ఎస్పి 30 లక్షల నిధులతో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, ముత్యాల భాస్కర్, కౌన్సిలర్లు భర్తకి జగన్, ఇందిరాల రమేష్, నాయిని సత్యనారాయణ, బర్ల మంగా జగదీశ్వర్, యాచారం రవీందర్, ముత్యాల చిన్న, కసర మౌని మల్లేష్, నీళ్ల భాను, శ్రీలత రాంబాబు, ఏ ఈ, అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.