శివానగర్ లో రంజాన్ కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
Published: Thursday May 06, 2021
జిన్నారం, మే 5, ప్రజాపాలన ప్రతినిధి : జిన్నారం మండలం శివనగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. ఆనంతరం ఐదు లక్షల రూపాయల గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించతలపెట్టిన అంతర్గత మురుగునీటి కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, స్థానిక సర్పంచ్ రేఖ, స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: