విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి

Published: Tuesday June 07, 2022
బోనకల్, జూన్ 6 ప్రజాపాలన ప్రతినిధి: ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక, ఉన్న త పాఠశాల బ్రాహ్మణపల్లి ఆధ్వర్యంలో బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, డి. రవి కిరణ్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుగులోతు. రామకృష్ణ మాట్లాడుతూ నాణ్యమైన విలువలతో కూడిన ఉచిత విద్య కొరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని ఈ సంవత్సరం నుండి 1 నుండి 8 తరగతుల వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతుందని కావున బడి ఈడు పిల్లలందరిని బడిలౌ చేర్చించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యస్ రామకృష్ణ,, పీ పుల్లారావు, రంజాన్ అలీ, అన్నపూర్ణాదేవి, రవికుమార్, ఆర్ మురళి, శశి కుమార్, అంగన్వాడి ఉపాధ్యాయులు కొంగర బేబీ, సులోచన తదితరులు పాల్గొన్నారు.