ఈనెల 28 లోగా రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలి

Published: Friday February 26, 2021
జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నారాయణరెడ్డి
 
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 25, ప్రజాపాలన: ఈనెల 28 లోగా రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నారాయణరెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంత గిరిజన అభ్యర్థులకు కార్యాచరణ ప్రణాళిక క్రింద  2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రాయితీ నిధులు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాకు 176 యూనిట్లకు గాను 10 కోట్ల 7 లక్షల రూపాయల రాయితీ నిధులు కేటాయించడం జరిగిందని, ఈ యూనిట్లను ఆయా మండలాల, మున్సిపాలిటీల వారీగా కేటాయించడం జరుగుతుందని, ఆసక్తిగల గిరిజన అభ్యర్థులకు ఈనెల 28వ తేదీలోగా సంబంధిత మండల ప్రజా పరిషత్ అధికారి / మున్సిపల్ కమిషనర్ సంప్రదించి tsobmms. cgg. gov. in వెబ్ సైట్ నందు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.