కస్తూరిబా గాంధీ కళాశాల యందు జాతీయ బాలిక దినోత్సవం

Published: Tuesday January 25, 2022
ఎర్రుపాలెం జనవరి 24 ప్రజాపాలన ప్రతినిధి: మండలం లోని ఎర్రుపాలెం గ్రామంలో గల కస్తూరిబా గాంధీ కళాశాల యందు జరిగిన జాతీయ బాలిక దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపిపి శ్రీమతి దేవరకొండ శిరీష పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నేటి బాలికలే రేపటి భారతావని భవిష్యత్తు వనిత లు అని అందుకని స్కూలు దశ నుండే పురుషాధిక్యత ఉన్న ఈ సమాజంలో జీవితాన్ని కొనసాగించాలంటే ధైర్యంగా బ్రతకడం నేర్చుకోవాలని, ఆ విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కస్తూరిబా గాంధీ కళాశాల ఎస్ వో సరితా మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.