ముఖ్యమంత్రి కేసీఆర్ కలసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
Published: Wednesday August 03, 2022
జగిత్యాల, ఆగస్టు 02 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కలిశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జగిత్యాల నియోజకవర్గ పరిధిలో పలు రోడ్లు, వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయని రోడ్లు, వంతెనల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. బీర్పూర్ మండలం రోళ్ల వాగు ప్రాజెక్ట్, అర గుండాల ప్రోజెక్టు,భారీ వర్షాలు, వరదలకు ప్రాజెక్టు లకు నష్టం వాటిల్లిందని, నీటి నిల్వ సామర్థ్యం లేకుండా పోయిందని పోజెక్టు కట్ట మరమ్మత్తు పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. దాదాపు వెయ్యి ఎకరాలలో పంట నష్టం జరగడమే కాక ఇసుక మెటలు వేయడం వల్ల పంట సాగుకు ఇబ్బందిగా మారిందని రైతులకు నష్టపరిహారం అందజేయాలని వారికి బాసటగా నిలవాలని ముఖ్యమంత్రి కోరారు.
Share this on your social network: