ఆలయ పునర్నిర్మాణానికి రూ కోటి మంజూరు చేయాలి ** జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు ** ఎమ్మెల్యే

Published: Thursday February 02, 2023

ఆసిఫాబాద్ జిల్లా జనవరి 31 (ప్రజాపాలన,ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ బాలేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ కోటి నిధులు మంజూరు చేయాలని జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు, ఎంపీపీ మల్లికార్జున్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్ లు కోరారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆలయ పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసే విధంగా సంబంధిత మంత్రి దిష్టికి తీసుకు వెళ్లాలని, టిఆర్ఎస్ నాయకులు, ప్రముఖులు, వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుండు రాజుల కాలంలో స్వయంభూకగా వెలసిన ఆలయం ప్రస్తుతం స్థిరావస్థలో ఉందని, భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని కోరారు. ఎమ్మెల్యే వినతి పత్రం అందజేసిన వారిలో టిఆర్ఎస్ నాయకులు గుండా వెంకన్న, వైరగారే శ్రీనివాస్(చారి) గోపాల్ నాయక్, నిసార్, తదితరులు పాల్గొన్నారు.