ప్రమాదం జరిగితేే గానీ పట్టించుకోరా

Published: Thursday December 02, 2021

కోరుట్ల, డిసెంబర్ 01 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ వెళ్లే రహదారిలో గత పది రోజుల కింద కల్వర్ట్ కూలి పెద్ద గుంత ఏర్పడి రాక పోకలు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది సంబంధిత అధికారులు మరియు నాయకులు చూసీచూడనట్లు వదిలేయడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. మార్గమధ్యంలో ఉండడం వలన ద్విచక్ర వాహనదారులకు ముప్పు ఉందని తెలుసుకున్న యువత ఏదో ఒక చిన్న ప్రయత్నంగా ఆ గుంత చుట్టూ కనబడేలా ఏర్పాటు చేశారు కానీ రాత్రి సమయంలో దూరం నుంచి వచ్చే వాహనాదారులకు దగ్గరగా వచ్చేదాకా కనబడాక ప్రమాదం జరిగే అవకాశం వుంది అధికారులు మాత్రం పది రోజుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి పట్టింపు లేకుండా వ్యవహరించడం జరుగుతుంది ఏదైనా పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు మరియు నాయకులు స్పందిస్తార అని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.