ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలి
Published: Tuesday October 18, 2022
డిఆర్ఓ అశోక్ కుమార్
వికారాబాద్ బ్యూరో 17 అక్టోబర్ ప్రజా పాలన : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఇంచార్జ్ డిఆర్ఓ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో సమస్యలపై 88 అర్జీలు వచ్చాయని ఆయన తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. ప్రజావాణి ఇన్చార్జి డిఆర్ఓ తో పాటు వికారాబాద్ ఆర్డిఓ విజయకుమారి, కలెక్టరేట్ పరిపాలనాధికారి అమరేందర్ లు పాల్గొన్నారు.
Share this on your social network: