ఉప్పల్లో ఆర్టీసీ బస్ టెర్మనల్ పనులను ప్రారంభించాలని బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ

Published: Tuesday February 22, 2022
మేడిపల్లి, ఫిబ్రవరి 21 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్లో బస్ టెర్మినల్ అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మహంకాళి దేవాలయం నుండి ఏసియన్ థియేటర్ వరకు భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. అభివృద్ధికి నోచుకోని బస్ స్టాప్ వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ తన హాయంలో జరిగిన ఎలివేటెడ్ కారిడార్ మరియు అనేక పనులు గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పై మండిపడ్డారు. ఇలాగే వ్యవహారశైలి మారకపోతే మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చేతన, బండారు శ్రీవాణి, ఉప్పల్, చిలకా నగర్ బీజేపీ అధ్యక్షులు రెడ్డిగారి దేవేందర్ రెడ్డి,గోనె శ్రీకాంత్ ముదిరాజ్ మరియు ఉప్పల్ సర్కిల్ బీజేపీ సీనియర్ నాయకులు మహంకాళి లక్ష్మణ్ ముదిరాజ్, సోమశేకర్ గౌడ్,రేవు నర్సింహా, కల్యాణం గీత రాణీ, గోనె అంజయ్య, కొల్లు బాలరాజ్ కురుమ, మేకల శిల్పా రెడ్డి,రెవెళ్లి రాజు, ఏసురి యాదగిరి, మర్నేని ఫణీంద్ర, వెంకట్ రెడ్డి, బండి పద్మా, సింగారం కార్తీక్, రవీందర్ రెడ్డి, వర్కల రాజేందర్ గౌడ్, సంగీ స్వామి యాదవ్, తెలంగాణ సంపత్, నాని గౌడ్, బూత్కురి రాజేష్ గౌడ్, నామ శ్రవణ్, నవీన్ గౌడ్, రిషికేశ్, దయ్యాల అమరెందర్, శ్రీనివాస్ ముదిరాజ్, లాఖాన్, దత్త సాయి వివిధ మోర్చా నాయకులు, రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.