క్రీడా ప్రాంగణాన్ని సందర్శించిన ఎంపీడీవో వేణుమాధవ్

Published: Tuesday September 27, 2022
బోనకల్ ,సెప్టెంబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందాపురం ఏ గ్రామo లో పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చెస్తున్న క్రీడా ప్రాంగణాన్ని సోమవారం ఎంపీడీవో వేణుమాధవ్ సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాగం శ్రీనువాసరావు మాట్లాడుతూ గ్రామంలో తుఫాన్ షెల్టర్ ఉండేదనీ, అది నిరుపయోగంగా ఉండడంతో తుఫాన్ షెల్టర్ స్థలం ను క్రీడా ప్రాంగణం ఏర్పాటు కు గ్రామ ప్రజలు కోరడం తో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగిందనీ తెలియజేశారు. ఎంపీడీవో వేణుమాధవ్ మాట్లాడుతూ గ్రామంలో క్రీడా ప్రాంగణం అందరికీ అందుబాటులో ఉండే విధంగా స్థల సేకరణ చేయడం జరిగిందని, అలాగే గ్రామంలో అభివృద్ధి పనులు చెయడం లో సర్పంచ్ బాగం శ్రీనువాసరావు కృషి ఎంతో అభినందనియం అని వేణుమాధవ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బాగం పాపారావు ,మెదరమెట్ల రాజారావు, బాగం మధుసూదన్ రావు, కావురి శంకర్రావు , ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ పంచాయితీ కార్యదర్శి హిమబిందు పాల్గొన్నారు.