సత్తుపల్లిలో కాషాయ జెండా ఎగరాలి..

Published: Thursday January 05, 2023
తల్లాడ, జనవరి 4 (ప్రజా పాలన న్యూస్):
బీజేపీ తల్లాడ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం తల్లాడ మండల అధ్యక్షుడు ఆపతి వెంకట రామారావు అధ్యక్షతన   సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  సత్తుపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ కనకాల వెంకట రామయ్య, నంబూరి రామలింగేశ్వర రావు   మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని రాబోయే ఎన్నికల్లో సత్తుపల్లి గడ్డపై కాషాయపు జెండాను రెపరెపలాడించాలని  ఉద్భోదించారు. ఈ కార్యక్రమంలో  నియోజకవర్గ కన్వీనర్ భాస్కర్ని వీరంరాజు, జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు, జిల్లా కో-ఆపరేటివ్ సెల్ కన్వీనర్ బాలాజీ నాయక్,  యుద్ధనపుడి శ్రీనివాస్, గాదె కృష్ణారావు, తొండపు మధు, నన్నపనేని శారద,  పాల్గొన్నారు.