సత్తుపల్లిలో కాషాయ జెండా ఎగరాలి..
Published: Thursday January 05, 2023
తల్లాడ, జనవరి 4 (ప్రజా పాలన న్యూస్):
బీజేపీ తల్లాడ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం తల్లాడ మండల అధ్యక్షుడు ఆపతి వెంకట రామారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ కనకాల వెంకట రామయ్య, నంబూరి రామలింగేశ్వర రావు మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని రాబోయే ఎన్నికల్లో సత్తుపల్లి గడ్డపై కాషాయపు జెండాను రెపరెపలాడించాలని ఉద్భోదించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ భాస్కర్ని వీరంరాజు, జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు, జిల్లా కో-ఆపరేటివ్ సెల్ కన్వీనర్ బాలాజీ నాయక్, యుద్ధనపుడి శ్రీనివాస్, గాదె కృష్ణారావు, తొండపు మధు, నన్నపనేని శారద, పాల్గొన్నారు.
Share this on your social network: