సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ కేతినేని ఇందు గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించి

Published: Friday February 17, 2023

బోనకల్, ఫిబ్రవరి 16 ప్రజాపాలన ప్రతినిధి:మండల పరిధిలోనే మోటమర్రి గ్రామంలో జిల్లా పరిషత్ గ్రాంట్, ఎంపీటీసీ గ్రాంట్ క్రింద మంజూరైన సీసీ రోడ్లకు మోటమర్రి సర్పంచ్ కేతినేని ఇందు గురువారం శంకుస్థాపన చేశారు. గ్రామంలో పూర్తి చేసిన చేసి రోడ్లను, డ్రైనేజీ పనులను ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్ సందర్శించారు. అనంతరం మోటమర్రి పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ముష్టికుంట్ల, పెద్దబీరవల్లి, రావినూతల, చిరునోముల, బోనకల్, బ్రాహ్మణపల్లి గ్రామాలలో అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలకు నీరు పట్టే విధానాన్ని ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఆయా గ్రామాలలో నిర్వహిస్తున్న నర్సరీలలో ఆ గ్రామాలకు అవసరమైన మొక్కలను పూర్తిస్థాయిలో పెంచాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఈ కార్యక్రమాలలో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, ఎంపీ ఓ వ్యాకరణం వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, పంచాయతీ కార్యదర్శులు నల్లబెల్లి రఘు, గుడికందుల కోటేశ్వరరావు, జొన్నలగడ్డ అశోక్ కుమార్, బంధం అర్జున్, దామల్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.