రెండు గ్రామాల మధ్య హద్దులు ఏర్పాటు చేయాలని తాసిల్దార్ కు వినతిపత్రం.

Published: Wednesday September 15, 2021
కొడిమ్యాల సెప్టెంబర్ 14 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలంలోని రెండు గ్రామాల మధ్య ఉన్నటువంటి రెవెన్యూ హద్దుల సమస్యను పరిష్కరించి గ్రామాల మధ్య హద్దులు ఏర్పాటు చేయాలని మంగళవారం నల్లగొండ గ్రామస్తులు తాసిల్దార్ కు వినతిపత్రం అందించారు.ఇటీవల మండలంలోని కొండాపూర్ గ్రామానికి బృహత్ పల్లె ప్రకృతి వనం మంజూరు అయిందని దీనిని నల్లగొండ ఫారెస్ట్ సరిహద్దుల్లో ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు అని కానీ కావున గ్రామాల మధ్యన హద్దులు నిర్ణయించినచో సరిహద్దు సమస్య పరిష్కారం అవుతుందని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీనివాస్, రేగుల తిరుపతి, సోమ శేఖర్, సామల అంజయ్య, పిల్లి మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.