విలేఖరి మురళికృష్ణ త్వరగా కోలుకోవాలి

Published: Thursday June 30, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 
వికారాబాద్ బ్యూరో జూన్ 29 ప్రజాపాలన : ప్రమాదవశాత్తు బైక్ పై నుండి కింద పడి తలకు తీవ్ర గాయం అయిన జీ టీవీ విలేఖరి మురళి త్వరగా కోలుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆకాంక్షించారు. బుధవారం హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో ఐసియు లో చికిత్స పొందుతున్న విలేఖరి మురళిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని  ఆసుపత్రి వైద్యులకు సూచించారు.