మధుమేహం వ్యాధిని నిర్లక్ష్యం చేయరాదు

Published: Friday December 09, 2022
మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో 8 డిసెంబర్ ప్రజా పాలన : మధుమేహం వ్యాధిని నిర్లక్ష్యం చేయరాదని వికారాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ హితవు పలికారు. గురువారం వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని 25వ వార్డులో మధుమేహానికి సంబంధించిన ఎన్ సి డి ( నాన్ కమ్యూనకబుల్ డిసీజ్ ) అసంక్రమిక వ్యాధుల కిట్ లను చైర్ పర్సన్ చెవులపల్లి మంజుల రమేష్ తన స్వంత వార్డులో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ చక్కెర వ్యాధి, రక్తపోటు ఎక్కువైనా తక్కువైనా ప్రాణాంతకం అవుతుందని హెచ్చరించారు. శారీరక రుగ్మతలలో ఏదైనా అనుమానం వచ్చినట్లయితే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య మధుమేహం అని అన్నారు. ఇది అత్యంత ప్రమాదకారి కానప్పటికీ.. షుగర్ మితిమీరితే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. శరీరంలోని గ్లూకోజ్ హెచ్చు తగ్గుల వల్ల ఈ వ్యాధి వస్తుందని వివరించారు. షుగర్ వ్యాధి నుంచి తప్పించుకోవాలంటే మాత్రం సరైన డైట్ ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. మధుమేహం వచ్చిన కూడా చాలా ఏండ్లు బ్రతికే వాళ్లు ఉన్నారని గుర్తు చేశారు. దానికి కారణం వాళ్లు తీసుకునే ఆహార జాగ్రత్తలే కారణమని వెల్లడించారు. ఆహార నియమాలే వీళ్ల ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వ్యాధిని ఆదిలోనే  గుర్తిస్తే దీని బారి నుంచి తప్పించుకోవచ్చని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం వరలక్ష్మి వార్డు ప్రజలు ఉన్నారు.