నాలా, బ్రిడ్జిల మరమ్మత్తు, పూడీకతీత పనులు వెంటన చేపట్టాలని కోరుతూ బీజేపీ ధర్నా

Published: Saturday June 19, 2021

శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, టాంక్ బండ్ జిహెచ్ఎంసి కమిషనర్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించడం జరిగింది, ముంపు ప్రాంతాలలో ఉన్న నాలా, బ్రిడ్జిల మరమ్మత్తు పనులు, నాలాలో పూడీకలు వెంటనే తొలగించాలని, రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభ్యులు రాజసింగ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రాంచందర్ రెడ్డి, ఎన్ వి ఎస్ ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, పన్నాల హరీష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ శ్యామ్ సుందర్, గౌతమ్, రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులతో పాల్గొన్నారు.