ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న బెల్లంపల్లి ప్రజా ప్రతినిధులు

Published: Saturday December 11, 2021
బెల్లంపల్లి డిసెంబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం నాడు జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి మండల ప్రజా ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూతులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తెరాస ప్రజాప్రతినిధులు అందరూ పార్టీ క్రమశిక్షణకు, నియమ నిబంధనలకు కట్టుబడి ఉండి ఓటు హక్కును వినియోగించుకున్నారని తెరాస పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండలంలోని ఎంపీటీసీలు, జడ్ పీటీసీలు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, హాజరై ఓటు హక్కును వినియోగించుకున్నారు.