చలో ఢిల్లీ ఏప్రిల్ 5 గోడపత్రాలు విడుదల

Published: Monday March 13, 2023

జన్నారం, మార్చ్ 12, ప్రజాపాలన: చలో ఢిల్లీ ఏప్రిల్ 5 గోడప్రతులను మంచిర్యాల జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కనికారపు అశోక్ విడుదల చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన సమావేశంలో కల పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకంగా ఏప్రిల్ 5 చలో ఢిల్లీ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఈ చలో ఢిల్లీ కార్యక్రమానికి అధిక సంఖ్యలో కార్మికులు, నాయకులు కార్యకర్తలు, ప్రజలు, ఇతరులు వచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.