దేవి శరన్నవరాత్రుల ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు రాగిడి లక్ష్మ

Published: Thursday September 29, 2022
మేడిపల్లి, సెప్టెంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి)
దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా  ఉప్పల్ నల్ల పోచమ్మ ఆలయంలో పోగుల దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఉప్పల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.భీష్మ గౌడ్, టీపీసీసీ మెంబర్ వినోద్ ముదిరాజ్ ఆధ్వర్యంలో  రామంతాపుర్ డివిజన్లోని మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న వేడుకలో ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం
ఆలయ కమిటీ సభ్యులు రాగిడి లక్ష్మారెడ్డిని శాలువాతో సత్కరించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న వితరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుధాకర్ శెట్టి, సంజయ్ జెన్, ఎస్సీ సెల్ చైర్మన్ ఉప్పల్ హెచ్ ఆర్ మోహన్, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ వంజరి సంతోష్, ఎయిమ్స్ చేర్మెన్ షబ్బీర్, రమేష్ నాయక్, కిషన్ నాయక్, సాయిబాబా, కరిపేమల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.