విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

Published: Tuesday September 20, 2022

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 19(ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని వర్షకొండ
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు  సర్పంచ్ దొంతుల శ్యామల తుక్కారం,ఎంపీటీసీ పొనకంటి చిన్న వెంకట్, చేతుల మీదుగా పంపించేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ఉచిత యూనిఫాం లు విద్యార్థుల్లో  ఆర్థిక,సామాజిక  పరమైన భేదాలు లేకుండా అందరూ సమానమనే భావన కలిగిస్తాయని,వీటిని చక్కగా వినియోగించుకొ వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో, ఉప సర్పంచ్ మంగిలిపల్లి లక్ష్మణ్,ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి , ఎస్ఎంసీ మెంబర్ మీర గంగాధర్,నాయకులు తుక్కారం ,ఉపాద్యాయులు పాల్గొన్నారు.