టిఆర్ఎస్ పార్టీ పటిష్ఠతే లక్ష్యం

Published: Tuesday September 07, 2021
మోమిన్ పేట్ మండల పార్టీ అధ్యక్షుడు నాసన్పల్లి నర్సింహారెడ్డి
వికారాబాద్ బ్యూరో 06 సెప్టెంబర్ ప్రజాపాలన : టిఆర్ఎస్ పార్టీ పటిష్ఠతే లక్ష్యంగా గ్రామ కమిటీలను నియమిస్తున్నామని మోమిన్ పేట్ మండల పార్టీ అధ్యక్షుడు నాసన్పల్లి నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం మోమిన్ పేట్ మండల పరిధిలోని అమ్రాది కలాన్ గ్రామంలో గ్రామ కమిటీని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ జెండాను, సంక్షేమ పథకాలను గడప గడపకు చేర్చాలని పిలుపునిచ్చారు. ప్రజోపయోగ సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన ప్రతి సంక్షేమ పథకం దేశంలో కీర్తిస్తూ తమ రాష్ట్రాలలో అమలు చేసేందుకు కార్యాచరణ ప్రారంభించారని గుర్తు చేశారు. అమ్రాది కలాన్ టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షునిగా పోతిగారి సంగమేశ్వర్, ఉపాధ్యక్షునిగా నాగభూషణం, ఎస్సీ. సెల్ అధ్యక్షునిగా దండి రాగివెల్లు, ఉపాధ్యక్షునిగా వనంపల్లి చంద్రశేఖర్, మైనారిటీ సెల్ అధ్యక్షునిగా దూదేకుల ఇబ్రాహిం, ఉపాధ్యక్షునిగా ఛోటు మియా, బిసి సెల్ అధ్యక్షునిగా పడమటి వీరణ్ణ, ఉపాధ్యక్షునిగా ఈడిగి వీరణ్ణ, యువజన అధ్యక్షునిగా ఆర్.విజయ్ కుమార్, ఉపాధ్యక్షునిగా గొల్ల శ్రీనివాస్ లను నియమించామని స్పష్టం చేశారు. బాధ్యతలు తీసుకున్న ప్రతి కార్యకర్త పార్టీ శ్రేయస్సు కొరకు కృషి చేయాలని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ బి.విజయ్ కుమార్, విఠల్, విష్ణువర్ధన్ రెడ్డి, వెంకట్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.