జనసేన పార్టీ తరుపున ఆర్ధిక సహాయం
Published: Monday September 19, 2022
మధిర రూరల్ సెప్టెంబర్ 18 ప్రజా పాలన ప్రతినిధి మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలం నాగిలికొండ గ్రామానికి చెందిన చాట్ల రమేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు ఆదివారం నాగలిగొండ వెళ్లి వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ మధిర నియోజకవర్గం తరుపున ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆర్ధిక సహాయం చేసిన వారిలో జనసేన మధిర నియోజకవర్గ నాయకులు మోదుగు సైదులు, అనంత శివరామకృష్ణ, కోట రంజిత్, మోదుగు రాజా, అద్దంకి సంతోష్, తలమాల జాన్, కాసిమాల శ్రావణ్ ఉన్నారు.
Share this on your social network: