అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయాలని ప్రయత్నించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి జనసేన పార్టీ
Published: Saturday July 23, 2022
బోనకల్, జూలై 22 ప్రజా పాలన ప్రతినిధి: ఖమ్మం జడ్పీ సెంటర్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయుటకు ప్రయత్నించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడి యాక్ట్ పెట్టి మరొకసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ విద్యార్థి విభాగ కార్యనిర్వాహక సభ్యుడు గంధం ఆనంద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానించిన గుండా పై కఠిన చర్యలు తీసుకునేంత వరకు వదలబోమని ఆయన హెచ్చరించారు.ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా పోలీస్ వారు కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Share this on your social network: