రైతులు నేరుగా వరి గింజలను వరి కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవాలి : సర్పంచ్ యాదయ్య సాగర్

Published: Tuesday May 04, 2021
పరిగి, 3 మే ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం, దోమ మండల పరిధిలోని  దోర్నాల పల్లి గ్రామంలో సోమవారం సర్పంచ్ యాదయ్య సాగర్  ఆధ్వర్యంలో ఏ ఈ ఓ దుర్గ ప్రసన్న అధికారిని రైతులకు వరి గింజల కొనుగోలు గురించి సుమారు నలభై టోకెన్స్ ఇవ్వడం జరిగింది అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దళారుల చేతులో మోసపోకుండా నేరుగా వరి గింజలను వరి  కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.