బిజెపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.....

Published: Friday February 04, 2022
ఎర్రుపాలెం ఫిబ్రవరి 3 ప్రజాపాలన ప్రతినిధి : రాజ్యాంగం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం నాడు ఎర్రుపాలెం మండలం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బిజెపి అధ్యక్షులు మొక్కపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇది అతని దురహంకారానికి నిదర్శనమని దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా సభ్యులు పుప్పాల చంద్రమౌళిలేశ్వర రావు, పింగళి శ్రీనివాసరావు, దేవరకొండ కోటేశ్వరరావు పిట్టల గోపాలరావు, కన్నా రామకృష్ణ, గోపాల్ రావు, రమేష్ రంగారావు, శివమణి రెడ్డి.రామకృష్ణ గౌడ్, మిరియాల నాగేశ్వరరావు, రమేష్  బొక్కరమేష్ శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.