ఉప్పల్ బస్సు డిపో దగ్గర మాన్యవర్ షోరూంను ప్రారంభించిన బండి బ్రదర్స్

Published: Friday March 25, 2022
మేడిపల్లి, మార్చి 24 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఉప్పల్ బస్ డిపో దగ్గర ప్రధాన రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన మాన్యవర్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బండి యాదగిరి గౌడ్, బండి గోపాల్ గౌడ్, బండి వెంకటేష్ గౌడ్, బండి శ్రీ రాములు గౌడ్, బండి సతీష్ గౌడ్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివాహా, శుభకార్యాలు, పండుగలకు కావలసిన వస్త్రాలకు పేరెన్నిక గాంచిన మాన్యవర్ షోరూం ను పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ చుట్టు ప్రక్కల ప్రజలకు అందుబాటులో ఉండేందుకు షోరూంను  ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాన్యవర్ షోరూం నిర్వాహకులు కస్తూరి వెంకటేశ్వర్లు, బాలకృష్ణ, నాగేశ్వర్, రమేష్, కిషన్ కుటుంబ సభ్యులు, మిత్రులు  పాల్గొన్నారు.