*ఘనంగా తహసీల్దార్ రాంబాబు వీడ్కోలు*

Published: Friday February 10, 2023
మధిర ఫిబ్రవరి 9 ప్రజాపాలన ప్రతినిధి
మధిర తహసిల్దార్ గా పనిచేసి బదిలీ అయిన రాంబాబుకి ఈరోజు సాయంత్రం రెవెన్యూ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. గత సంవత్సరం జూన్ 18న పదవీ బాధ్యతలు చేపట్టిన రాంబాబు మండల ప్రజలకు మెరుగైన సేవలు అందజేశారు. అదేవిధంగా సీనియర్ పాత్రికేయులు మక్కెన నాగేశ్వరావు కిలారి కిషోర్ పాగి బాలస్వామి మున్సిపల్ కమిషనర్ రమాదేవి సిబ్బంది తిరుపతి వేణు తహశీల్దార్ రాంబాబును కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ రాజేష్ ఆర్ఐ జయ కృష్ణ తదితరులు పాల్గొన్నారు