మోటమర్రి ఉన్నత పాఠశాలలోని పేద విద్యార్థులకు భోజన ప్లేట్స్ మరియు జంపఖానాలు వితరణ
Published: Thursday February 10, 2022
బోనకల్, ఫిబ్రవరి 9 ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని మోటమర్రి ఉన్నత పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయుడు చేడే శ్రీనివాస్ అభ్యర్థన మేరకు సామాజిక సేవా తత్పరులు అయిన పుల్లఖండం చంద్రశేఖర్ మోటమర్రి ఉన్నత పాఠశాల లోని పేద విద్యార్థులకు భోజన ప్లేట్స్ మరియు విద్యార్థులు కూర్చొవడానికి జంపఖానాలు వితరణ చేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు షేక్ చాంద్ పాషా మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు భోజనం ప్లేట్స్ మరియు జంప ఖానాలు వితరణ చేసినందుకుగాను ప్రధానోపాధ్యాయులు షేక్ చాంద్ పాషా మరియు పాఠశాల సిబ్బంది చంద్రశేఖర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుల్లఖండం చంద్రశేఖర్, మాధవరపు నాగేశ్వరరావు, కొల్లా శ్రీనివాస్ రావు, వూట్ల రమణ, ఎం రమేష్, ఎమ్.గోపి, చేడే శ్రీనివాస్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: