హెల్త్ సెంటర్ కోసం సామాగ్రి అందజేత

Published: Monday July 19, 2021
రంగా రెడ్డి, జులై 18, ప్రజాపాలన ప్రతినిధి : రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం యాచారం మండలం. పరిదిలోని చింతపట్లలో ఆదివారం బెలదే ధనలక్ష్మి ఫౌండేషన్ బెలదే మల్లయ్య జ్ఞాపకార్ధం మల్లయ్య కుమారులు రాంమోహన్, పిఆర్టియు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ గుప్త, రాజశేఖర్, విజయభాస్కర్ ఆద్వర్యంలో గ్రామంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్ర నిర్వాహణకై దాదాపు రూ. 75వేల వ్యయంతో కూడిన ఆసుపత్రి సామగ్రిని ఆసుపత్రి నిర్వాహకులకు అందజేసారు. సామాగ్రితోపాటు హెల్త్ సెంటర్ కు రంగులు వేయించడంతోపాటు కరెంటు మరమ్మతులు చేయించారు. ఫౌండేషన్ నిర్వాహాకులు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసమై వివిధ సందర్భాల్లో తమ వంతు చేయూతగా  సహాయ సహకారాలు అందజేశామని వారు గుర్తు చేసారు. గ్రామభివ్రుద్దిలోతమ వంతు చేయూతగా మున్ముందు మరింత సహకారం అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లిక్కి సరితపాండురంగారెడ్డి, ఉపసర్పంచ్ శేఖర్, మన ఊరు మన బడి స్తాపకులు ఎండి. సాబేర్, మండల బిజెపి అధ్యక్షులు తాండ్ర రవీందర్, సిస్టర్ సువర్ణ, ఆశా వర్కర్లు రమాదేవి, మంజుల, రంగారెడ్డి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.