డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం : ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

Published: Tuesday May 04, 2021
పరిగి, 3మే ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో గల విద్యారణ్యపురి తుంకుల్ గడ్డ లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ భూమి పూజ నిర్వహిచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, తెరాస కార్యకర్తలు ఆర్ అండ్ బి, ఆర్డబ్ల్యూఎస్  అధికారులు  పాల్గొనడం జరిగింది.