గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్లు

Published: Friday September 17, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్దాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి ఆహ్వానం మేరకు మేయర్  జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ 3వ డివిజన్లోని శ్రీ సాయి ఎన్క్లేవ్ కాలనీ వినాయక మండపంను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మట్టి గణపతిని పూజిస్తూ, గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. మట్టి గణపతి ప్రతిమణలను పెట్టిన శ్రీ సాయి ఎన్క్లేవ్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు 5000/- రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి సతీష్, కాలనీ వాసులు వెంకట్ రెడ్డి, నర్సింహ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, మనోహర్ రెడ్డి, వెంకటప్ప, నరేందర్, జోసెఫ్, బ్రహ్మచారి, రమేష్బాబు, సోమిరెడ్డి, పెంచల్రెడ్డి, శ్రీనివాస్, బాలక్రిష్ణా రెడ్డి, సతీష్, ప్రశాంత్, మరియు పిల్లలు, మహిళలు పాల్గొన్నారు.