మేడిపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీని సన్మానించిన పీర్జాదిగూడ కార్పొరేషన్ పాలకవర్గం

Published: Tuesday June 29, 2021
మేడిపల్లి, జూన్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : మేడిపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కార్పోరేషన్ పాలకవర్గం ప్రెస్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్షులు సంకూరి మురళి, కార్యనిర్వాహక అధ్యక్షులు వెల్లంకి జయపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కల్కురి ఎల్లయ్య, ఉపాధ్యక్షులు రేగు శ్రీనివాస్, దబ్బెటి నర్సయ్య, సంయుక్త కార్యదర్శులు వంగ శ్రీనివాస్ రెడ్డి, ఎన్.రాము యాదవ్, గుండ్ల కుమారస్వామి, కోశాధికారి చిర్రా శ్రీధర్ రెడ్డి, కో- ఆర్డినేటర్ పర్రెపాటి శ్రీనివాస్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లెల్లపాటి నర్సింహారెడ్డి,  సలదారులు వి.సూర్యనారాయణ రెడ్డి, శిలువేరు వేణుగోపాల్, దూడల విష్ణు గౌడ్, కార్యవర్గ సభ్యులు ఎ.వెంకటేశ్వర్లు, కె.నాగభూషణం చారి, వి.సుందర్ లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులై ప్రజా సమస్యలపై సమాచారాన్ని  అందించాలని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్, కార్పొరేటర్లు కె.సుభాష్ నాయక్, కోల్తూరు మహేష్, బచ్చ రాజు, పిట్టల మల్లేష్, ఎంపల్ల అనంత్ రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు బొడిగే రాందాస్ గౌడ్, షేక్ ఇర్ఫాన్, నాయకులు పప్పుల అంజిరెడ్డి, యాసారం మహేష్, లేతాకుల రఘుపతి రెడ్డి, వీరమల్ల సత్యనారాయణ, బండి సతీష్ గౌడ్, కుర్ర శ్రీకాంత్ గౌడ్, అలువాల దేవేందర్ గౌడ్, పత్రికా విలేకరులు జున్ను శ్రీనివాస్, కె శ్రీనివాస్, స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు.