సురేష్ చందను మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీ చైర్ పర్సన్
Published: Thursday April 01, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 31 ( ప్రజాపాలన ) : పదవీ విరమణ చేసిన తెలంగాణ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు సురేష్ చందను బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతామహేందర్ రెడ్డి. స్థానిక సంస్థలను బలోపేతం చేయడంలో కృషిచేసిన సురేష్ చందా సేవలను ఈ సంధర్బంగా గుర్తుచేసి ఆయనకు అభినందనలు తెలిపారు. సునీతారెడ్డితో పాటు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేష్ గౌడ్ ఉన్నారు.
Share this on your social network: