స్మశాన వాటికలో మౌళిక వసతుల పనులను పరిశీలించిన కార్పొరేటర్ చేతన హరీష్

Published: Friday November 04, 2022
మేడిపల్లి నవంబర్ 3 (ప్రజాపాలన ప్రతినిధి)

హబ్సిగూడ డివిజన్ సీట్ నెంబర్1 పిఎన్టి కాలనీ దగ్గర హిందూ స్మశాన వాటికలో జరుగుతున్న మౌళిక వసతుల పనులను స్థానిక కార్పొరేటర్ చేతన హరీష్ ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రవీందర్, ఉప్పల్ సర్కిల్ డీఈ నాగమణి లతో కలిసి పరిశీలించారు. స్మశాన వాటికలో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కార్పొరేటర్ కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్టేట్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్స్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఓయూ మరియు హబ్సిగూడ డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు సంజయ్ పటేల్, గ్యారా రవి, సురేష్, వర్క్ సిబ్బంది పాల్గొన్నారు.