ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ని కలిసిన మధిర బార్ అసోసియేషన్ సభ్యులు

Published: Wednesday July 07, 2021
మధుర, జులై 06, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ హరికృష్ణ భూపతి గారిని మధిర కోర్టు న్యాయవాదులు కలిసి 1930 లో నిర్మించిన మధిర కోర్టు భవనం పూర్తిగా పురాతనమై దాదాపు శిథిలావస్థకు చేరిందని, కొత్త భవనాన్ని మంజూరు చేయడానికి సహకరించవలసిందిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ని కోరగా వారు అనుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు భైరవభట్ల శ్రీనివాసరావు సీనియర్ న్యాయవాదులు వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, నంబూరు జనార్దన్ రావు, నెల్లూరు రవి, రెంటపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.