రాష్ట్రాభివృద్ధికి ఆకర్షితులై టిఆర్ఎస్ లో చేరికలు

Published: Thursday March 31, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 30 మార్చి ప్రజాపాలన : రాష్ట్రాభివృద్ధికి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరికలు ఎక్కువగా వస్తున్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో కోట్ పల్లి మండల పరిధిలోని కరీంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ సయ్యద్ ఫక్రుద్దీన్, మాజీ ఉప సర్పంచ్ పెంటయ్య, మజీద్ సదర్ హమ్మద్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏర్రోళ్ళ నర్సింలు, కావలిరాజు, సలీంగౌస్, మైబు ప్రభు, కమల్, ఎల్లయ్య, షబ్బీర్, ఆనందం, లక్ష్మణ్, వాయెద్, సద్ధర్ వీరితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది అనుచరులు టి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అనిల్, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.