రైతులకు వడ్లు కొనుగోలు డబ్బులు వెంటనే చేలించాలి
Published: Friday May 28, 2021
జిన్నారం, ప్రజాపాలన ప్రతినిధి : రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వెంటనే చేలించాలని మాల యువసేన జిల్లా అధ్యక్షులు నీరుడి విరాస్వామి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి ఎండ అనక వాన ననక పనీ చేసి వరి పంటలు పండించిన పంటకు గిట్టుబాటు ధరను ప్రభుత్వం వెంటనే చేలించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఐకెపి కొనుగోలుకు తెచ్చిన వడ్లను రైతుల వద్ద నుండి వెంటనే కొనుగోలు చేయాలని డబ్బులు రెండు రోజులోగా రైతుల అకౌంట్లో డబ్బులు చెల్లించాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. దళారులను నమ్మి రైతు లు మోసపోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.
Share this on your social network: