తుమ్మల మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలి..

Published: Tuesday November 16, 2021
తల్లాడ, నవంబర్ 15 (ప్రజాపాలన న్యూస్) : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను సోమవారం తల్లాడలో ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు (కేవీ) నాయకత్వంలో అన్నారుగూడెం గ్రామ సర్పంచ్ మారేళ్ళ మమత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల మధ్య కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టారు. అనంతరం తల్లాడ వైద్యాధికారి డాక్టర్ నవ్యకాంత్ చేతుల మీదుగా పండ్లు ఫలాలు, రొట్టెలు పంపిణీ చేశారు. కొమ్మినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తుమ్మల నాగేశ్వరరావు ఇటువంటి వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన ఘనత తుమ్మల నాగేశ్వరరావుకే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో కూడా ఆయనకు మంచి భవిష్యత్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మాజీ జడ్పీటీసీ మూకర ప్రసాద్, ఎంపిటిసి గోవిందు విజయమ్మ, ఉపసర్పంచ్ గోవిందు భాగ్యమ్మ, టిఆర్ఎస్ నాయకులు పొన్నం కృష్ణయ్య, గోవిందు శ్రీనివాసరావు (ట్రాక్టర్), గోవిందు నరసింహారావు, గుమ్మా వలరాజు, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్. యాకూబ్ పాషా, తదితరులు పాల్గొన్నారు.