ఆళ్ళపాడు అంగన్వాడి కేంద్రంలో విద్యుత్ ఏర్పాటు

Published: Tuesday October 11, 2022

బోనకల్, అక్టోబర్ 10 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్ళ పాడు గ్రామంలో ఒకటవ అంగన్వాడి కేంద్రంలో గత 10 సంవత్సరాల నుండి విద్యుత్ లేక పిల్లలు ఇబ్బంది పడటం చూసి అంగన్వాడీ టీచర్ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించి గ్రామ సర్పంచ్ మర్రి తిరుపతిరావు కరెంటు ఏర్పాటు చేయడం జరిగింది. అంగన్వాడి కేంద్రంలో కరెంటు ఏర్పాటుచేసిన సర్పంచ్ కు అంగనవాడి టీచర్, గ్రామ పెద్దలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు, అంగన్వాడి టీచర్ గౌరమ్మ, మొండితోక లక్ష్మణ్, దాసరి లక్ష్యాద్రి పాల్గొన్నారు.