వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు. మధిర రూరల్ జూలై8 ప్రజా పా

Published: Saturday July 09, 2022

జనహృదయనేత దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా మధిరలో వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కిషోర్ కుమార్ దొంతమాల మరియు పార్టీ నాయకులు స్థానిక పార్టీ క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేశారు.అనంతరం  వైఎస్ఆర్ సర్కిల్,జిలుగుమాడులో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు.వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జిలుగుమాడులో పలుకుటుంబాలను కిషోర్ కుమార్ వైయస్సార్ తెలంగాణ పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు.తరువాత వసంతమ్మ సేవాసదనం,ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమం కలకోటలోని కెఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో కిషోర్ కుమార్ చేతుల మీదుగా అన్నదానం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ అందించిన సంక్షేమ పాలనను గుర్తుచేసుకున్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గూడూరు రమణారెడ్డి,దేవంభట్ల శ్రీనివాస్ శాస్త్రి,యన్నం కోటా రెడ్డి,దోర్నాల శ్రీను,నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బలవంతపు రాజేష్,ఎర్రుపాలెం యూత్ కన్వీనర్ నలమోలు తిరుపతిరెడ్డి,మధిర సోషల్ మీడియా విభాగం నాయకుడు భరత్ సూర్య కార్యకర్తలు వేల్పుల శేఖర్,లక్ష్మారెడ్డి,వీరేందర్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.