దేశ వ్యాప్తంగా మత్స్యకారుల మద్దత్తు కేసిఆర్ కే : మత్స్యకారుల సమన్వయ సంఘం సభ్యుడు గుండ్లపల్ల

Published: Thursday October 06, 2022

రాష్ట్ర నేత, దేశ నేత గా మారుతున్నందుకు, కేంద్రస్థాయిలో పార్టీ ఏర్పాటు చేయనున్న ముఖ్యమంత్రి కె సి ఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు మత్స్య కారుల సంఘం. రాష్ట్రం లో వెయ్యి కోట్లతో మత్స్య కారులకు నిధులు అందజేసిన కె సి ఆర్, దేశవ్యాప్తంగా మత్స్య కారులకు న్యాయం చేస్తారని నమ్మకం తమకుంది అని అన్నారు. కేంద్రం లో నేటికి బీసీ లకు మంత్రిత్వ శాఖ లేదన్నారు,రాష్ట్రం లో మత్స్య కారుల సంక్షేమం కొరకు కృషి చేస్తున్న కేసిఆర్ కు కేంద్రస్థాయిలో మత్స్యకారుల అండ ఉంటుందని అన్నారు.ఒక్క గుజరాత్ లోనే తమ మత్స్య కారులకు సంబందించి నాలుగు వేల పై చిలుకు సంస్థ లున్నాయని, త్వరలో ఢిల్లీ లో జరగబోయే తమ జాతీయ స్థాయి సమావేశం లో ఈ ప్రస్తావన తీసుకు రాబోతున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో మత్స్యకార సమన్వయ కమిటీ సభ్యులు అల్లుడు జగన్ , గుండ్లపల్లి శ్రీనివాస్,బల్ల సత్తయ్య ముదిరాజ్. లతో పాటు దమ్మిగారి కనకయ్య,రంజిత్,కాగిత సతీష్ తదితరులు పాల్గొన్నారు.