సిపిఎస్ స్కూల్ ఫేర్వెల్ డే కార్యక్రమం ముఖ్య అతిథులుగా మధిర మున్సిపల్ చైర్ పర్సన్ లత

Published: Saturday April 01, 2023

మధిర, మార్చి 31 ప్రజాపాలన ప్రతినిధి:మధిర సిపిఎస్ స్కూల్ నందు ఫేర్వెల్ డే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయాకర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే పిల్లలంతా క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి, కౌన్సిలర్ కోన ధనికుమార్ , భరత్ వెంకట్ రెడ్డి, మాధవరపు నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు ప్రభుదాయాల్, ఉపాధ్యాయులు, విద్యార్థి పాల్గొన్నారు.