ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి వేడుకలు

Published: Monday February 22, 2021
బాలాపూర్ :ప్రజాపాలన న్యూస్; శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి వేడుకల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. మహేశ్వరం నియోజకవర్గం, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నంది హిల్స్ బస్ స్టాప్ దగ్గర శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 282 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మన విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డితో కలిసి మేయర్ కార్పొరేటర్లు జ్యోతి ప్రజ్వలన చేశారు. సభ ఉద్దేశిస్తూ మంత్రి మాట్లాడుతూ..... తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కులానికి చెందిన వారికి సంక్షేమ పథకాలు తో పాటు కుల వృత్తులు చేసుకోవడానికి జీవనోపాధి కల్పిస్తున్న ప్రభుత్వమని చెప్పారు. గిరిజలందరూ  మాతాండలోనే మాకు సర్పంచ్ లు కావాలంటే ఏ ప్రభుత్వం చేయని టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి అమలు చేయడం జరిగింది అన్నారు. శ్రీ సంత్ సేవాలాల్  మహారాజ్ మహోత్సవంలో భాగంగా మీర్ పేట లో కూడా గిరిజన అసోసియేషన్ వారికి భవనం కట్టిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీపు లాల్ చౌహాన్, కార్పొరేటర్లు, బంజారా సోదరులు సోదరీమణులు తెరాస నాయకులు మహిళా నాయకురాలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.