ఫిజియోథెరపీ క్యాంపు ప్రారంభం

Published: Friday September 24, 2021
బోనకల్లు, సెప్టెంబర్ 23, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండలం గ్రామాల్లో గల దివ్యాంగ పిల్లల కొరకు ప్రత్యేకంగా ఫిజియోథెరపీ క్యాంపు బోనకల్ మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించడం జరిగింది. కావున మండలంలో గల దివ్యాంగ పిల్లలు ఈ యొక్క ఫిజియోథెరపీ క్యాంపు సద్వినియోగం చేసుకోవాలని బోనకల్ మండలం విద్యాశాఖవారు కోరడమైనది. ఈ ఫిజియోథెరపీ క్యాంపు ప్రతి బుధవారం బోనకల్ మండల వనరుల కేంద్రంలో నిర్వహించబడును. ఈ సేవలకు ప్రత్యేక ఫిజియోథెరపీ డాక్టర్ ఏఈ ప్రసాద్ నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏఈ ప్రసాద్ మరియు ఐ ఇ డి టీచర్స్ దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.