సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం హర్షనీయం

Published: Saturday September 17, 2022
జన్నారం, సెప్టెంబర్ 16, ప్రజాపాలన: 
 
నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి  అంబేద్కర్ పేరు పెట్టడం పట్టు  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోర్లకుంటా ప్రబూదాస్ హర్షం వ్యక్తం చేశారు. . శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో  మీడియా సమావేశంలో మాట్లాడారు .  డిల్లీలో నాతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పేట్టి చిర స్థాయిగా చరిత్రలో నిలిచే విదంగా చూడాలని కేంద్ర ప్రభుత్వం కు అయన  సూచించారు . రాష్ట్ర సచివాలయంలో 1025 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అయన డిమాండ్ చేశారు. ఈ కార్యాక్రమంలో జిల్లా నాయకుడు ముత్యం రాజన్న, ప్రదాన కార్యదర్శి సయ్యద్ ఫసీఉల్లా, మండల పట్టణ అధ్యక్షుడు దుమాల్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు.