రెబ్బెన మండలం మధ్వాయిగూడ వరకు బస్సు నడపాలి ** డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్యాం రావు **

Published: Friday December 09, 2022

ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 8(ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలోని రెబ్బెన మండలం నుండి మద్వాయిగూడ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బోర్కు ట్టే శ్యాం రావు కోరారు. గురువారం రెబ్బెన మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో శ్యాం రావు మాట్లాడుతు రెబ్బెన నుండి మద్వాయిగూడకు వెళ్ళుటకు గంగాపూర్, లక్ష్మీపూర్, పాశీగా, తుంగెడ, పోతపల్లి, మీదుగా మాధ్వాయగుడకు వెళ్లాలి. అలా వెళ్లక పోవడంతో విద్యార్థులు, ప్రజలు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. దీనివల్ల విద్యార్థుల చదువులకు సమయానికి కళాశాలకు వెళ్లలేక పోతున్నారని, పరీక్షల సమయంలో ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉందన్నారు. ప్రతిరోజు మండల కేంద్రానికి  వివిధ పనుల నిమిత్తం వందల మంది వచ్చిపోతుంటారని, సరైన సమయానికి బస్సులు లేక కాలినడకన వెళ్లాల్సి వస్తుందన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు చోరువ  తీసుకొని విద్యార్థులను, ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాద్యావాయిగూడ వరకు బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రెబ్బెన మండల అధ్యక్షుడు చాపిడి పురుషోత్తం, శివ, రమేష్, నిజాముద్దీన్, వంశీ,లు పాల్గొన్నారు.