బీరుపూర్ టెంపుల్ ఈఓ కరోనాతో మృతి...

Published: Thursday May 13, 2021
బీరుపూర్, మే 12 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ముద్ధం శ్రీనివాస్ కరోనాతో మంగళవారం రాత్రి మృతి చెందారు. అయన మృతి పట్ల టెంపుల్ చైర్మన్ నెరేళ్ల సుమన్ గౌడ్ ఆలయ పాలక వర్గ సభ్యులు మరియు బీరుపూర్ ఎంపీపీ మసర్తి రమేష్ జడ్పీటిసి పాత పద్మారమేష్ వైస్ ఎంపీపీ బలుమురి లక్ష్మణ్ రావు ప్యాక్స్ చైర్మన్ ముప్పాల రాంచందర్ రావు మాజీ జడ్పీటిసి కోలుముల రమణ మాజీ టెంపుల్ చైర్మన్స్ గొడుగు కేశవులు బైరవేని అంజనేయులు గోనె రమణ రావు సర్పంచు ఘర్షకుర్తి శిల్పరమేష్ గుడిసె జితేందర్ యాదవ్ తదితరులు విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.